The New Ahobilam Temple Collapsed in South Africa: దక్షిణాఫ్రికా(South Africa)లోని విషాదం చోటు చేసుకుంది. క్వాజులు-నాటల్ ప్రావిన్స్లో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల హిందూ దేవాలయం కూలిపోవడంతో నలుగురు మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇథెక్విని (గతంలో డర్బన్) ఉత్తరాన రెడ్క్లిఫ్లోని ఒక నిటారుగా ఉన్న కొండపై ఉన్న న్యూ అహోబిలం టెంపుల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో భవనంలోని ఒక భాగం కూలిపోయింది. శిథిలాల కింద చాలా మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: Narges Mohammadi: నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మది అక్రమ అరెస్ట్..!
మృతి చెందిన వారిలో ఆలయ ట్రస్ట్ కార్యనిర్వాహక సభ్యుడు, ప్రాజెక్ట్ మేనేజర్ అయిన విక్కీ జైరాజ్ పాండేగా గుర్తించినట్లు అధికారులు తెలిపారని స్థానిక మీడియా వెల్లడించింది.

